Wednesday, June 17, 2020

కవితలు

1
ఇది వీరా గుడిపల్లి కవిత
20/05/2020
శీర్షిక ః అతను మేక రవీంద్ర
**********************
ఎక్కడ ఓ పూవు వికసించినా
అక్షర పరిమళం మనసున పరుచుకున్నా
ఆ వనం తనదేనని ప్రకటించగలడు
ఆరువేల
కవన సైన్యానికి అప్రకటిత రారాజు తాను
అక్షరాలను శ్వాసించేవాళ్ళు
ఆలంబనకై చూస్తున్న రోజుల్లో
ఆశల్ని నాటి
ఒంటరిగా వనాలను నాటిన మాలి మరి
నమ్మలేని నిజాలెన్నింటికో
నమ్మకమైన సాక్ష్యం అతను
కవిమిత్ర నుండి పద్యశ్రీ వరకు ఎన్ని మజిలీలో
అంతర్జాల సమూహాలను
అక్షరాలతో స్నేహింపజేసిన అభినవ తెలుగు భోజుడు
పురస్కారాలకు కొత్త భాష్యం చెప్పి
అక్షర ప్రేమికులకు అందమైన మార్గాలను వేసిన మార్గదర్శి.
సాహిత్య పుర వీధుల్లో అడుగడుగునా కనిపించే కటౌట్....
అందరి హృదయాలలో చెదరని చిత్రం...
పిలవాలను కుంటే పలకాలనుకుంటే
మేక రవీంద్ర అతని పేరు
**********వీరా గుడిపల్లి*******
2
ఇది వీరా గుడిపల్లి కవిత
(మన్నెంకొండ వెంకయ్య
కృష్ణాంబ దంపతులకు ఎనిమిదవ సంతానంగా  హనుమద్దాసు జన్మించాడు)
శీర్షిక ః హనుమద్దాసు
**************
అక్కడ అన్నమయ్య
అక్కడెక్కడో రామదాసు
ఇక్కడ హనుమద్దాసు
మన్నెంకొండ హనుమద్దాసు
 పాలమూరు తిరుపతి
వాగ్గేయకారుడు
మన్యంకొండ
లక్ష్మీనరసింహస్వామి ప్రియ భక్తుడు
దేవతల భూమి (తమిళ ప్రాంతంలో)
శ్రీరంగం
అలహరి గ్రామం
పూర్వీకుల పుట్టిల్లు
అలహరి వంశనామమై భాసిల్లింది
కేశవయ్య
కలలోకొచ్చిన ఎంకన్న
మన్నెంకొండకు వెళ్ళమంటే కదా
లక్ష్మీనరసింహస్వామిని సేవిస్తూ స్థిరపడిపోయాడు
ఎవరికి కావలసిన వాల్లను
వాల్లే పిలిపించు కుంటారు
కేశవయ్య ముని మనవడు
హనుమద్దాసు
చదువు ఒంటబట్టకుంటేనేం
వేదాంతి వెంకయ్య
అలహరి వంశం వారసత్వం
మన్నెంకొండ లక్ష్మీనరసింహస్వామి
ఆశీస్సులు
అర్చకత్వం
ధర్మకర్తృత్వం ప్రసాదిస్తే
వారసత్వపు వాసనలొదలక సాగడం
వాగ్గేయకారుడై వెలిగి పోవడం
కోటకదిర
అలహరి  ప్రత్యేక పూజలు
ఆ తరువాతే
మన్యంకొండ ఉత్సవాలు
భక్తి... శక్తి.. ముక్తి
హనుమద్దాసు... మార్గం
మన్యంకొండ ... చెప్పిన సత్యం
మనగురించి మాట్లాడే వారు ఉండాలని
స్వామి కీ తెలుసన్నమాట
లక్ష్మాంబ తత్వదర్శనం
నిత్య రామనామ జపం
హనుమద్దాసు మన్యం కొండ
విడదీయలేని పదాలైపోయాయి
అవసరమెవరిదైనా...
అసలు సత్యమదే మరి
....... వీరా గుడిపల్లి
ఇది వీరా గుడిపల్లి కవిత
3
31/05/2020
ఎవరితోను
**********
ఏమాశించి చేశాడు
సమాధానం లేదు
ఎవరూ తెలీదు
వెతుక్కన్నాడు
దండలేశాడు
షాల్స్ కప్పాడు
తెలుగు అక్షరాలు
చల్లినా, చదివి వినిపించినా
ఎందుకు చేశాడు
సమాధానం లేదు
పాదుల్ని పీకేయాలని చూశినా
పందిళ్ళు కూల్చాలని చూసినా
పెదవి విప్పిందే లేదు
ఓడిపోయింది లేదు
ఎందుకిలా
తనకూ తెలీదంటారు
ఒంటరి ప్రయాణమే
ఆరువేల సైన్యమున్నా
ఎడారి జాడలనే వెతుక్కుంటాడు
ఒయాసిస్సులను తవ్వడానికి
కన్నీటి చారలనే కనిపెడుతూ వెళతాడు
తుడిపేయడానికి.
అక్షరాలు ఎక్కడ కనపడతాయోననీ
అక్షర ప్రేమికులెక్కడున్నారని
నిరంతరం
కొత్త కలాల కోసం
కలాల జాడకోసం సాగే అన్వేషణలో
అడుగులేస్తున్న అక్షర ప్రేమికుడు
అక్షరాలను మోస్తున్న వారికోసం
వెల్తున్న అన్వేషి
ఎవరతనంటే..... మేక రవీంద్రే కదా
........ వీరా గుడిపల్లి

ఇది వీరా గుడిపల్లి కవిత
4
అమ్మపల్లి
1/6/2020
********
*అమ్మపల్లి వెల్లాలి*
***
ఆయన లేనిదెక్కడ
అక్కడికే ఎందుకు వెల్లాలి
భద్రాద్రి
ఒంటిమిట్ట
అయోధ్య
అంతేనా...
ఊరూరుకో మందిరం
ఇంటింటికో దేవుని గది
అక్కడికే ఎందుకు వెల్లాలి
కోదండరామస్వామి ఆలయం
అమ్మపల్లి
అక్కడికే ఎందుకు వెల్లాలి ????
సర్వాంతర్యామి
పాద తాడనంతో పునీతమైన
స్థలం.... యెక్కడున్నా
కోదండ రామ స్వామి...
కంటిచూపుతో పునీతమైన ప్రాంత మేదైనా
కనీసం ఒక్కసారైనా.... వెల్లాల్సిందే......
వెల్లాల్సిందే....అమ్మపల్లి
..... వీరా గుడిపల్లి
ఇది వీరా గుడిపల్లి కవిత
5
10062020
*పలకదు*
******************
రాలిపడే ఆకు
రాపాడే కొమ్మ
రాయని వాక్యం
పలుకని మాట
హార్స్ పవర్ తో లెక్కించలేం
తులసీ దళం తో తూచలేం
కొంటెగా కొట్టేయలేం
మట్టిని చీల్చుకుని వచ్చే మొక్క కాదది
బొట్టు పెట్టి దైవం చేసి
బోనం పెట్టి ఆకలితీర్చామని
తృప్తి పడే మనసు కాదది
నిజాన్ని పసికట్టి
ధర్మం తెలిసి
మౌనంతో కప్పేయబడ్డ
హృదయమది
పలకదు
........ *వీరా గుడిపల్లి*
6

ఇది వీరా గుడిపల్లి కవిత
10/06/2020
సబర్మతీ ఆశ్రమం
******"*************
పుష్కర కాలం
పవిత్ర పాదాలు నడయాడిన నేల
ఉప్పు సత్యాగ్రహపు
ప్రణాళికలు ప్రాణం పోసుకున్న చోటు
దండి యాత్ర
మొదలైన ప్రాంతం
సబర్మతీ తీరంలో
జాతి పిత సేదదీరిన మట్టి ..
జాతిపిత నివసించిన ప్రాంతం
హృదయ కుంజ్....
జాతి హృదయ మతనే కదా
గోచీ కట్టి
అహింసా ఆయుధం ధరించి
భరతమాత దాస్య శృంఖలాలు తొలగించి బోసినవ్వులలదుకొన్న యోగి
చెప్పాలంటే...
ప్రజాస్వామ్య రాజర్షి
ఆశ్రమం
మీరాబెన్ మనసుపడిన నేల
కిసాన్ ఆశ్రమానికి
ఆలోచనలు మొలకెత్తిన చోటు
మహాత్ముడి మనసింకా తచ్చాడుతున్న నేల
సబర్మతీ ఆశ్రమం
....... వీరా గుడిపల్లి
ఇది వీరా గుడిపల్లి కవిత
7
10)06/2020
గూగుల్ గురువు
*****************
ఏకలవ్యుడు
భయపడాల్సిన పనిలేదు
బొటనవేలు కోరడీ గురువు
గాండీవి
ప్రియ శిష్యుడేంకాదు
ప్రియ శిష్యుడనే పదమే లేదు
అందరూ సమానమే
పక్షపాతం లేదు, పార్థుడైనా సరే
గీత బోధించడానికి
బావమరిదే కానవసరం లేదు
అడిగేదెవరైనా సరే
కాదనకుండా ఇవ్వడమే తన లక్ష్యం
మతం లేదు కులం లేదు
మాయా దర్పణం పనికేరాదు
గురువంటే
నిర్వచనం మారింది
కొడుకును బ్రతికించమనో
పగవాడిని పట్టితెమ్మనో
కోరే స్వార్ధపరుల రంగు బయటపడింది
గురువంటే
అడిగిందివ్వడం
బదులేదీ కోరక పోవడం
శిష్యుడినడ్డం పెట్టుకుని మీసం మెలేయడం
కాదు
పాత వాసనలనొదిలి
పరికిస్తే తెలుస్తోంది
గురువంటె
గూగుల్.......
కాదంటావా....
మహాత్ముడు పుట్టిన నేల
మర్చిపోకు నిజం చెప్పడం
......... వీరా గుడిపల్లి
ఇది వీరా గుడిపల్లి కవిత
8
13/06/2020
*సమాధానం*
***********************
పోతిదేవర శిష్యరికం
పోటెత్తిన సంద్రం లా మలిచింది
శివకవిగాశివాలెత్తేలా చేసింది
పాల్కురికి పాటవానికి
ప్రణతులర్పించేలా చేసింది
మంత్రాల దాష్టీకాన్ని
మంటగలిపే ఘంటారావం
పాల్కురికి రూపంలో
పొటమరించింది.
రగడ  ఛందోరీతులకు దారులేసి
సాహితీ కబ్జాల భారతం పట్టాడు
పురాణాల ఆంతర్యం తెలిసి
బసవ పురాణమై అవతరించాడు.
రుద్ర పశుపతి
ఉడుమూరి కన్నప్ప
మడివాలు మాచయ్య
మసిడి చౌడయ్య
కిన్నెర బ్రహ్మయ్య
యే కధ చూసినా యేమున్నది
పాల్కురికి సోమనాథుడు
పటాపంచలు చేసిన ఆధిపత్య భావజాలం.
విప్లవరీతులేవైనా
అక్షర స్వామ్యం తో సాధించిన వీరుడు
పాల్కురికి సోమన్న పాటవమంతే
సాహిత్యం యేంచేయగలదన్న వారికతనే సమాధానం.
...... *వీరా గుడిపల్లి*
ఇది వీరా గుడిపల్లి కవిత
9
17/06/2020
సన్మానిస్తా....
****************-
నాలుగు అక్షరాలు చల్లి
పది వాక్యాలు మెడలో వేసి
పైనో కవిత కప్పాలనుంది
పాటై జ్ఞాపకంగా నిలిచి
సాహిత్య పేజీగా సహవాసం చేసి
కావ్యమై కలకాలం నిలిచి పోవాలనుంది.
మంజుల,ఉపేందర్ ల ముద్దు బిడ్డ కు
ముద్దుగా ప్రణమిళ్ళాలనుంది.
కల్నల్ సంతోష్ బాబు ను
సన్మానించాలని ఉంది.
ముందే
భారతమ్మ కంఠహారమై పోయాక
అమరపురి ఆహ్వానం అందుకున్నాక
ఇంద్ర సభకా అవకాశం ఇచ్చేశాక
యేం చేయగలను
నాలుగక్షరాలు చల్లి
వాక్యాలు మెడలో వేసి
కవితై కౌగిలించుకుని
సాహిత్యమై తనను సన్మానిస్తా.
......... *వీరా గుడిపల్లి*
ఇది వీరా గుడిపల్లి కవిత
10
17/06/2020
అంశం ః సన్మానం
***********************
శీర్షిక ః ఎలా
సరిహద్దు వివాదం
సృష్టించిందెవరో గానీ
మక్మోహన్ గీసిన గీత దాటి
చొరబడాలని
చూసిందెవరోగానీ
సంతోష్ బాబులిరవైమంది
బలైపోయిన వేళ
అమ్మ మాటలు విన్నాక
కడుపు కోత కన్నా
భరతమాత సేవే గొప్పదని చెప్తున్న
మంజులమ్మ మాటలు
నా దేశానికి భయం లేదని చెప్తున్నాయి
వీరమాతల , వీరపుత్రుల, వీరపత్నుల
రక్షణలో
భరతమాత భద్రం గా ఉందంటున్నాయి.
యే అక్షరాల మాలవేద్దాం
యే కవితల శాలువా..గప్పుదాం
సంతోష్ బాబు తల్లి
కాదు
భారతీయులందరికీ
అమ్మై ధైర్యం చెప్పిన
మంజులమ్మనెలా సన్మానించుకుందాం???
......... *వీరా గుడిపల్లి*